విద్యార్థులకు చేయూతను అందించడం అభినందనీయం

 విద్యార్థులకు చేయూతను అందించడం అభినందనీయం 


9వ్యూస్, వేములపల్లి మండలం,జులై 04: ప్రభుత్వ పాఠశాలలో విద్య నభ్యసించే పేద, మధ్యతరగతి విద్యార్థులకు దాతలు ముందుకు వచ్చి చేయూతనందించడం అభినందనీయనమని ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ అన్నారు. 

శుక్రవారం మండల కేంద్రానికి చెందిన ఉగ్గే మునేశ్వర్, శివ లో తమ తండ్రి లింగయ్య జ్ఞాపకార్థం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు ,పెన్సిల్లు ,అందించగా ఆయన వాటిని పంపిణీ చేసి మాట్లాడారు . ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు రమేష్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకన్న ఉపాధ్యాయులు సైదులు, శ్రీనివాస్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.