గంజాయి విక్రేతల అరెస్ట్
210 గ్రాముల గంజాయి,
రెండు సెల్ ఫోన్ లు స్వాధీనo...
మరో వ్యక్తి పరారీ...
కోరుట్ల, నవంబర్: 12 (9వ్యూస్) కోరుట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రోజు ఇద్దరు వ్యక్తులు గాంజా అమ్ముతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు, సిసిఎస్ సిఐ ఏం. శ్రీనివాస్, వారి సిబ్బంది, కోరుట్ల ఎస్సై ఎం చిరంజీవి, ఆధ్వర్యంలో, ఇద్దరు ప్రభుత్వ పంచుల సమక్షంలో, రైల్వే స్టేషన్లో గంజాయి విక్రయిస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన షేక్ అమన్ (ఫైజు రజా) 21 వృత్తిరీత్యా కారు మెకానిక్, మరో వ్యక్తి ఏం. డి. ముఖీం 21 డిగ్రీ చదువుతున్నాడు. కాగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 210 గ్రాముల గంజాయి ని , రెండు సెల్ ఫోన్ లను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేయగా మరొక వ్యక్తి పరారీ లో ఉన్నాడు. కోరుట్ల సీఐ బి సురేష్ బాబు మాట్లాడుతూ గంజాయిని ఎవరు తాగిన, అమ్మిన, రవాణా చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు.

