అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్....
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన విప్....
కథలాపూర్, (కోరుట్ల) నవంబర్ :16 (9వ్యూస్) జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పెంటల బుజ్జమ్మ నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఆదివారం గృహ ప్రవేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుజ్జమ్మ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో నేడు స్వంత ఇంటి కల సాకారం అయ్యిందని, ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


